టెట్‌ ఫలితాలు విడుదల

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-2025 ఫలితాలు (TET Results) విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జూన్‌ 18 నుంచి 30 వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,37,429 మంది ఈ పరీక్షలు రాశారు. ఇందులో 30,649 మంది అర్హత సాధించారు. పేపర్‌-1లో 61.5 శాతం మంది అభ్యర్థులు పాస్‌ అయ్యారు. ఫలితాలను అభ్యర్థులు http: scooledu.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.