రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక గాంధీ అసుపత్రి లో అకస్మీక పర్యటన చేసారు. ఈ పర్యటన లో గాంధీ అసుపత్రిలో అన్ని విభాగాలను మంత్రి పరిశీలించారు. అసుపత్రికి వచ్చిన రోగులతో అప్యాయంగా మాట్లాడారు. అసుపత్రి లో అందిస్తున్న చికిత్సలపై రోగులను , వారి వెంట వచ్చిన సహాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, గాంధీ అసుపత్రి పనితీరు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో గాంధీ అసుపత్రిలో IVf, IUI సేవల బలోపేతం పై చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అసుపత్రులలో IVf, IUI సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
అలాగే, గాంధీ అసుపత్రిలో ఉన్న సిటి స్కాన్, MRI SCAN లతో పాటు ఇతర హెల్త్ ఎక్యూప్మమెంట్ ను పూర్తి స్థాయిలో వినియేగంలోకి తేవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులను అదేశించారు. హెల్త్ ఎక్యూప్ మెంట్ ను పూర్తి స్థాయిలో మరమత్తులు చేసేందుకు PMU (ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ ) ను ఏర్పాటు చేసుకొని TGMSIDC ఇంజనీరింగ్ అదికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అధికారులను అదేశించారు. అసుపత్రిలో శానిటేషన్ సమస్య , డ్రైనేజీ సమస్య పరిష్కరానికి STP లను ఏర్పాటు చేయాలని మంత్రి అదేశించారు.
గాంధీ అసుపత్రిలో అన్ని అపరేషన్ థియోటర్లు ఓకే చోట ఉండేలా O T complex ఎర్పాటు పై కమీటి నీ నియమించి నివేదిక ను సమర్పించాలని మంత్రి అదేశించారు. గాంధీ అసుపత్రి కి వచ్చే పెషంట్ల సహాయకుల కోసం ప్రస్తుతం ఉన్న షెడ్డు స్థానంలో CSR నిధులతో కోత్తగా 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని మంత్రి అదేశించారు. గాంధీ అసుపత్రిలో వైద్య సేవల బలోపేతానికి చర్యలు చేపట్టాలని మంత్రి అదేశించారు. వైధ్య సేవల అందించటంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని మంత్రి దామోదర్ రాజనర్సింహా హెచ్చరించారు. గాంధీ అసుపత్రిలో OP, IP, సర్జరీలు, స్పేషాలిటీ సేవలు, సూపర్ స్పేషాలిటీ సేవలను అందించేందుకు ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహా వెల్లడించారు.