కరీంనగర్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు పాల్గొన్నారు.
సమావేశంలో జిల్లా అబివృద్ధి అజెండాగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్లు రహదారులు సాగునీటి ప్రాజెక్టులు విద్య వైద్య రంగాల్లో జరుగుతున్న అబివృద్ధి కార్యక్రమాల పురోగతి పై చర్చించారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైజింగ్ తెలంగాణ లక్ష్యంగా సాగుతున్న పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యే లు పార్టీ నియోజక వర్గ ఇన్ ఛార్జ్ లు నిబద్ధత తో నిజాయితీ గా పని చేయాలని మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు.సాగునీటి ప్రాజెక్టులు పై రైతు భరోసా రైతు రుణ మాఫీ పై బీ.ఆర్.ఎస్ బిజేపి నేతలు చేస్తున్న అసత్య ప్రచారం క్షేత్ర స్థాయిలో తిప్పి కొట్టాలని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో అలసత్వం లేకుండా చూడాలని కోరారు.
సన్నబియ్యం పథకం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం రైతు భరోసా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రభుత్వం పై ప్రజానీకం విశ్వాసంగా ఉన్నారని మంత్రి తుమ్మల తెలిపారు.
పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్ లు రహదారులు నిర్మాణం లో ఫోకస్ పెట్టాలని అన్ని వర్గాల వారికి పార్టీలకు అతీతంగా ప్రజా పాలనలో పారదర్శకంగా ఉండాలని మంత్రి తుమ్మల తెలిపారు. పత్తి వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతాంగం ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలని అబివృద్ధి లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తనదైన ముద్ర వేయాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాల తో పాటు పార్టీ బలోపేతం పై ప్రధాన దృష్టి పెట్టాలని ,గత ప్రభుత్వ అరాచక అవినీతి కోటలు బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ,గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలని బిజేపి బీ.ఆర్.ఎస్ రెండు పార్టీలు ఎలా తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతున్నారనే విషయాలపై పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు.
