పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకుందాం: సమాచార పౌర సంభందాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్.ప్రియాంక

హైదరాబాద్ : పర్యావరణానికి హానిచేయని సహజంగా లభించే మట్టి విగ్రహాలతో వినాయకున్ని పూజించి పర్యావరణ పరిరక్షణ లో అందరు బాగస్వాములు కావాలని సమాచార పౌర సంభందాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్.ప్రియాంక కోరారు. సోమవారం సమాచార శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను స్పెషల్ కమీషనర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, గణేష్ చతుర్థి పది రోజుల పాటు జరిగే ముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు. రసాయనాలు, పి.ఓ.పి తో తయారు చేసిన గణపతి విగ్రహాలను వాడటం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని, పి.ఓ.పి విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు సంచాలకులు డి.ఎస్.జగన్, జాయింట్ డైరెక్టర్లు డి.శ్రీనివాస్, కె.వెంకటరమణ, CIE రాధాకిషన్, డిప్యూటి డైరెక్టర్లు యం.మధుసూధన్, సి.రాజారెడ్డి, సమాచార శాఖ సిబ్బంది పాల్గొన్నారు.