“కూతుళ్ల భద్రత – కూతుళ్ల విద్య”

నవరాత్రి & బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్, శ్రీమతి నేరెళ్ళ శారద ఆదేశాల మేరకు మహిళా కమీషన్ ఆధ్వర్యంలో “కూతుళ్ల భద్రత – కూతుళ్ల విద్య” అనే అవగాహన కార్యక్రమాన్ని అన్నోజిగూడ, ఘటకేసర్ మండలం, మేడ్చల్ జిల్లాలో ఘనంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో శ్రీమతి ఈశ్వరి భాయి, మహిళా కమీషన్ మెంబర్ ముఖ్య అతిథిగా హాజరై సమాజంలో బాలికల రక్షణ, బాలికలకు నాణ్యమైన విద్య అందించడంపై అవగాహన కల్పించారు. బాలికలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మహిళా కమిషన్ సెక్రటరీ, పద్మజ రమణ మాట్లాడుతూ కూతుళ్లను భద్రంగా, సమాన హక్కులతో చదివించడం ప్రతి కుటుంబం కర్తవ్యమని, విద్య ద్వారానే బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని,చట్టపరమైన రక్షణలు, 181 , 100 హెల్ప్‌లైన్ సదుపాయాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలియజేశారు.
మరియు ఈ కార్యక్రమంలో షి టీమ్ అధికారులు మహిళలు మరియు బాలికలకు సైబర్ సేఫ్టీ మరియు సామాజిక మాధ్యమాల వినియోగం మీద అవగాహన కలిగించారు అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గారు మహిళలు మరియు బాలికలకు ఎటువంటి పోషకాహరం తీసుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత ,మరియు ఆరోగ్యంపైన అవగాహన కలిగించారు.

నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు మహిళా శక్తి, ఆడబిడ్డల ప్రాధాన్యతకు ప్రతీకలని, ఈ సందర్భంలో సమాజం మొత్తం కూతుళ్ల భద్రత, విద్యకు కట్టుబడాలని మహిళా కమిషన్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో షి టీమ్,మెడికల్ ఆఫీసర్,అంగన్వాడీ టీచర్స్ , ఆడాల్సెంట్ గర్ల్స్, మహిళలు మరియు అల్వాల్ సి డి పి ఓ, శ్రీమతి స్వాతి, ఐసీడీఎస్ supervisors, మహిళా కమీషన్ అధికారులు పాల్గొనడం జరిగింది.