ఏపీలో బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటనలో మరొకరు మృతి.. ఏడుకు చేరుకున్న మృతుల సంఖ్య

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోన‌సీమ జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని రాయ‌వ‌రం గ‌ణ‌ప‌తి గ్రాండ్ బాణ‌సంచా ( Fire Factory) త‌యారీ కేంద్రంలో పేలుడు (Explosion) చోటు చేసుకోగా ఒక్కసారిగా అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ అగ్నికీల‌ల్లో చిక్కుకుని బుధవారం ఆరుగురు స‌జీవ ద‌హ‌నం కాగా ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.