- కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణలో గౌరవెల్లి సహా.. ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయికుమార్ను రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సెక్రెటరీ కోఆర్డినేషన్ డా.గౌరవ్ ఉప్పల్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్.. ఢిల్లీలో తన్మయికుమార్ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన అనుమతులపై చర్చించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం మే 2025లో ఇచ్చిన ‘వనశక్తి’ తీర్పును ఇటీవల వెనక్కి తీసుకుందని.. దీనిపై న్యాయసలహా తీసుకొని.. అనుమతుల మంజూరు చేస్తామని తన్మయికుమార్ చెప్పినట్టు మంత్రి వివరించారు. ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేస్తే.. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశాలు పెరుగుతాయని కార్యదర్శికి వివరించినట్టు మంత్రి తెలిపారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విదేశాల్లో ఉన్న కారణంగా.. తన్మయికుమార్ను కలిసి.. ప్రాజెక్టుల అనుమతుల గురించి చర్చించినట్టు చెప్పారు.