తెలంగాణ రైజింగ్ 2047​ గ్లోబల్​ సమ్మిట్​కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047​ గ్లోబల్​ సమ్మిట్​కు హాజరు కావాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
జార్ఖండ్ సీఎం నివాసం లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్​ సమ్మిట్​ ఆహ్వాన పత్రికను సీఎం శ్రీ హేమంత్ సోరెన్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. 3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని డిప్యూటీ సీఎం వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యుమెంట్​ ను రూపొందించినట్లు ఈ భేటీ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. నీతి అయోగ్​ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్​ డాక్యుమెంట్​ ను గ్లోబల్​ సమ్మిట్​ లో ఆవిష్కరించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జార్ఖండ్ సీఎం కు వివరించారు.