హైదరాబాద్ : ప్రజాకవి అందెశ్రీ ని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే అని రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి, సామాచార, పౌర సంబంధాల శాఖ పూర్వ స్పెషల్ కమీషనర్ ఫణి కుమార్ వెల్లడించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల (TS &AP) వార్షిక ఆత్మీయ సమ్మేళనం నేడు ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు హాల్ నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి, సమాచార శాఖ పూర్వ స్పెషల్ కమీషనర్ జీ.ఎన్. ఫణికుమార్ ముఖ్య అతిధిగా హాజరుకాగా, రిటైర్డ్ డైరెక్టర్లు కిస్మత్ కుమార్, సుభాష్ గౌడ్, సత్యా రావు, శ్రీనివాస్, ప్రమోద్ రావు , విశ్రాంత అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫణి కుమార్ మాట్లాడుతూ, ప్రముఖ కవిగా ఉన్నప్పటికీ 2001 లో అందెశ్రీని ప్రపంచానికి తన పాటలను రాయించడం ద్వారా పరిచయం చేసింది సమాచార శాఖనే అని అన్నారు. 2001లో జరిగిన మహిళా జన్మ భూమి కార్యక్రమానికి తమ శాఖాపరమైన ఆహ్వానంపై ఎన్నో ఉత్తేజకరమైన పాటలు రాసారని, అయితే ఆ పాటల్లో తెలంగాణా కువ్యతిరేకంగా గానీ, కించపరుస్తూ రాయనని అందెశ్రీ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో సమాచార, పౌర సంబందాల శాఖ ఎంతో విశిష్టమైనదని, ఎంతటి క్లిష్టమైన మేఘా ఈవెంట్లను అతితక్కువ వ్యయంతో కస్టపడి, స్వచ్ఛందంగా పనిచేసి విజయవంతం చేసే అధికారులు, సిబ్బంది ఉండడం కేవలం ఈ శాఖలోనే సాధ్యం అని పేర్కొన్నారు. ఏ ఇతర శాఖలో ఉత్పన్నం వచ్చినా అది మనదే అని ఫీల్ అయ్యే శాఖ కేవలం సమాచార శాఖ అని, ముఖ్యమంత్రి తోపాటు ఇతర వీ.వీ.ఐ.పి లతో నేరుగా ప్రత్యక్షంగా పనిచేసే శాఖ కేవలం ఇదేనని అన్నారు. ఇంటలిజెన్స్ తో సమానంగా సమాచార శాఖ పనిచేస్తుందని, ప్రభుత్వానికి కళ్ళు, చెవుల మాదిరిగా ఉండే ఈ శాఖ కు ఎప్పుడూ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టంచేశారు. అయితే, పీఆర్ఓ విధుల నిర్వర్తించడం ఆషామాషీ శాఖ కాదని. ఎంత చేసినా అద్భుతంగా చేసినారని ఎవరూ మెచ్చుకోరని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. లీగల్ అంశాలపై ప్రసంగం , యోగా, ఆరోగ్య విషయాలపై ప్రత్యేక క్లాసులు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
