సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ బృందం. సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకు వస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వివరాలను హిమాచల్ ప్రదేశ్ మంత్రికి వివరించిన సీఎం. 25 ఎకరాల సువిశాల స్థలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట మినీ యూనివర్సిటీ తరహాలో 200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకు రానున్నట్లు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి ఒక కమిటీని నియమించామని, త్వరలోనే పాలసీని తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసేందుకు వీలుగా ప్రీ ప్రైమరీ విద్య అందించే విధానం అమలు చేయనున్నట్లు మంత్రికి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ ప్రైమరీ చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే యోచన చేస్తున్నట్లు తెలిపిన సీఎం. రాష్ట్రంలో ఐటిఐ లను ఏటీసీలు గా తీర్చిదిద్దుతున్నట్లు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. మల్లెపల్లి ఐటీసీ ని సందర్శించాలని హిమాచల్ ప్రదేశ్ మంత్రికి సూచించిన ముఖ్యమంత్రి. టిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం పైన ఆసక్తి చూపించిన హిమాచల్ ప్రదేశ్ మంత్రి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర నివేదిక ను తమకు అందించాలని విజ్ఝప్తి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టతకు ముఖ్యమంత్రి విజన్ ను అభినందించిన హిమాచల్ ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి రోహిత్ కుమార్.