ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి జవదేకర్ కు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, నామా నాగేశ్వర్ రావు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్, కే కేశవరావు కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.