తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

  • ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకు ముందు 50.7% DA ఉండగా, ఇపుడు దాన్ని 52.8% కి పెంపు. పెరిగిన DA జనవరి 1, 2026 నుండి అమలు. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లించనున్న ప్రభుత్వం. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. చివరగా జూలై 2025 లో కూడా 2.1% DA పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జూలై 2025 లో 48.6% నుండి 50.7% నికి పెంపు. ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డీఏ తో 52.8 % కి చేరింది. మే 2024 లో RPS – 2017 అమలు తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు లేవు.. డీఏ లో పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ ప్రకటించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అభినందించిన ఆర్టీసీ ఎండీ ఇతర ఉన్నతాధికారులు. ఆర్టీసీ లో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏ ను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది… దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరింది. జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ లు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో మొదటి నుండి ఆర్టిసి సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తుంది. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమం పై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ కు ఆసుపత్రి అప్గ్రెడేషన్ ,కారుణ్య నియామకాలు,దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం ,కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం ,కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తుంది. పెండింగ్ లో ఉన్న డీఏ 2.1 శాతం పెంచడం వల్ల గతంలో ఉన్న 50.7 శాతం నుండి 52.8 శాతానికి పెరిగింది. తెలంగాణ లో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇది ఉపయోగపడుతుంది. తెలంగాణ లో లైఫ్ లైన్ గా ఉన్న ఆర్టీసీ నీ మరింత ప్రజల్లోకి తీసుకెళ్లలా కృషి చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులనుంచి ఎదురుచూస్తున్న డీఏ ను ఈరోజు ప్రకటించడం సంతోషమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయని నాగిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈడీ లు సిహెచ్.వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, శ్రీ.సాల్మన్, ఎఫ్ఏ శ్రీమతి విజయపుష్ప, సి & ఏం శ్రీ .శ్రీధర్, సిపిఎం శ్రీమతి ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు.