గ్రీన్ఇండియాఛాలెంజ్ మరియు రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్

గ్రీన్ఇండియాఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు మొక్కలు నాటిన నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పెద్దబొడ్డేపల్లి గ్రామంలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన రోజాకి ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణపైన ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని, భాగస్వాములై మొక్కలు నాటాలి. మానవాళికి పరోక్షంగా , ప్రత్యేక్షంగా ఉపయోగపడే పక్షులు మన ఇంటి పరిసర ప్రాంతాల్లో గూడుకట్టుకుని ఉండేవి ఇప్పుడు వాటికి చెట్లు లేకపోవడం వల్ల పక్షులకు నివాసయోగ్యంగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. మన వంతుగా మనం మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ మన గ్రామాల్లో కానీ వీలున్నంతగా పండ్ల మొక్కలు జనాలకు ఉపయోగపడే చెట్లను నాటి వాటిని కాపాడాలి . ఈ కార్యకమాన్ని ఆంద్రప్రదేశ్ లో ఉదృతంగా ముందుకు తీసుకెళ్తూ , మొక్కల పెంపకం పైన అవగాహన కల్పిస్తున్న రోజాని ఎంపీ సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.