గ్రీన్ ఇండియా ఛాలెంజ్ & రోజా వనంలో పాల్గొని మొక్కలు నాటిన విశాఖ ఏజన్సీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నగరి శాసనసభ్యురాలు రోజా ఛాలెంజ్ మేరకు స్థానిక పాడేరు కస్తూరిబాయ్ విద్యాలయంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మొక్కలు నాటారు.
విశాఖ ఏజన్సీ శాసనసభ సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పాడేరు మండలం లగిసపల్లి కస్తూరిబాయి పాఠశాల ప్రాంగణంలో గ్రీన్ ఛాలెంజ్ మరియు రోజా వనంలో భాగంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రకృతికి కోసం కార్యాలయాల్లో, పాఠశాలల్లో మొక్కలు నాటి పచ్చదనంగా తీర్చిదిద్ది అచ్చమైన, స్వచ్ఛమైన ఆక్సిజన్ ని తీసుకోవాలని సూచించారు. దీనికి పునాదులు విద్యార్థులేనని తమ తమ ప్రాంతాలలో, గ్రామాలలో పచ్చదనం కోసం మొక్కలు నాటి గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచి అచ్చమైన ఆక్సిజన్ ని పిలిచి ఆరోగ్యాన్ని ప్రకృతిని సంరక్షించుకోవాలి అని సూచించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మొక్కలను సేకరించి మొక్కలు నాటి స్వచ్ఛమైన గాలి పీల్చాలని కోరారు. దేశం రాజధాని ఢిల్లీలాంటి ప్రముఖ నగరాలలో కృత్రిమ ఆక్సిజన్ని కొనుక్కొని పీల్చే పరిస్థితి నెలకొంటుందని ఆర్.కే రోజా, నగరి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రీన్ చాలెంజ్, రోజా వనం లో భాగంగా ఈ రోజు లగిసపల్లి, కస్తూర్బాయి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.విద్యార్థులు బాగా చదివి విద్యావంతులుగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బుల్లి బాబు, సింహాచలం అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు సువర్ణ, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ని, ప్రత్యేక చొరవతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న సిని నటి, నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా గారిని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ ప్రత్యేకంగా అభినందించారు.