ప్రభుత్వ సలహాదారుగా రామకృష్ణారావు

ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న సీఎస్‌ కె.రామకృష్ణారావును ముఖ్యమంత్రికి సలహాదారుగా, ఎక్స్‌ అఫిషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును 2025 ఏప్రిల్‌ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన అదే ఏడాది ఆగస్టు 31న రిటైర్‌ కావాల్సి ఉంది. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీసును మరో 7 నెలలు పొడిగించింది. అంటే, ఈ ఏడాది మార్చి 31న బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంది. సీఎం మరో 3 నెలల పాటు పొడిగించాలని కోరడంతో కేంద్రం ఈ నెల 30 వరకు పదవీ కాలాన్ని పొడిగించింది. దీంతో ఆయన 30న రిటైర్‌ కానున్నారు.