అసెంబ్లీలో గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ప్రసంగం

* ఆరు దశాబ్దాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాదించుకుంది.
* తెలంగాణ రాష్ట్రం స్వల్ప కాలంలోనే అనేక రంగాల్లో ప్రగతి సాధించింది.
* దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో గర్వకారణం.
* ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ నాయకుడే సారధిగా ఉండటం కలిసొచ్చిన అంశం.
* బిపిఎల్ లో ఉండే కుటుంబాలను నిర్దేశించేందుకు ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో 60 వేల నుంచి లక్షన్నర- పట్టణాల్లో 75వేల నుంచి రెండు లక్షల వరకు పెంపు.
* రాష్ట్రంలో పెన్షన్స్ 2016 రూపాయలు ఇవ్వడం పేదలకు ఉపయోగకరం.
* వృధ్యాప్య పెన్షన్స్ 65 నుంచి 57 కు కుదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* 959 రెసిడెన్షియల్ విద్యాలయాలు నిర్వహిస్తుంది.
* తెలంగాణ అమరవీరులకు కుటుంబానికి 10 లక్షలు-ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం.
* 50వేల వరకు పేదలకు ఉపాధి కల్పన కోసం వందశాతం సబ్సిడీ.
* ఎస్సి-ఎస్టీలకు ఇండ్లలో విద్యుత్ బిల్లు 101 యూనిట్ల వరకు ఉచితంగా అందించబడుతుంది.
* విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 22,667 మంది ఆర్టిజన్ల సర్వీసును ప్రభుత్వం క్రమబద్దీకరించింది.
* తెలంగాణ రాష్ట్రంలో 13, 168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చింది.
* తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 16, 246 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులో ఉంది.
* కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఏర్పాట్లు సాగుతున్నాయి.
* 310 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం సుమారు 40 టీఎంసీల సమర్థ్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజిని మంజూరు చేసింది.
* రైతుబంధు దేశానికే ఆదర్శంగా నిలిచింది.
రైతు సమన్వయ సమితి పేరు మార్పు
రైతు బంధు సమితులు గా పేరు మార్పు
* దేశంలో ఎక్కడా లేని విదంగా రైతుభిమా పథకం అమలు.
* మిషన్ కాకతీయ పథకం పై దేశంలో మిగతా 11 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి.
* తెలంగాణ రాష్ట్రంలో 84 పిహెచ్ సిలు …ఎస్ క్యూ ఎ ఎస్ స్థాయిని పొంది దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
* న్యూ బార్న్ సెంటర్లు 22 నుంచి 42 పెంచాలని నిర్ణయం.
* తెలంగాణ రాష్ట్రంలో 4 కి మరో ఐదు జోడించి 9 మెడికాల్ కాలేజీలు పెంచింది.
* రాష్ట్రంలో కొత్త పరిశ్రమల వల్ల 2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* పరిశ్రమల వల్ల 14లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి.
* గడిచిన ఏడాది ఐటీ రంగంలో తెలంగాణ వృద్ధి రేటు 16.89 శాతం కావడం ప్రగతి.
* 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం సాగుతున్నాయి.
* తెలంగాణ శాంతి భద్రతల అదుపులో ఉన్నాయి.
* తెలంగాణ 6 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు.
ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడింది
*ఆర్థిక మాంద్యం వల్ల తెలంగాణ ప్రభుత్వం ఆర్థికాంశాలల్లో కఠినమైన క్రమశిక్షణ పాటించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆకలి దప్పులు లేని, అనారోగ్యాలు లేని, శతృత్వ లేని రాజ్యమే గొప్ప రాజ్యం