టీడీపీకి భారీ షాక్‌.. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ రాజీనామా..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపిన ఆయన టీడీపీ అధిష్టానం వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. సుధీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న డొక్కా.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. శాసన మండలి సమావేశాలకు ముందే ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు కూడా వచ్చాయి.