
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. సోనియా పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి.. గురువారం ఉదయం ఆమెతో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.