
కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన సృష్టిస్తుందని ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే వారిపై ఎన్డీఎమ్ఏ యాక్ట్ సెక్షన్ 54 కింద కేసును నమోదు చేస్తామన్నారు. ఈ సెక్షన్ కింద దాదాపు ఏడాది జైలు, జరిమానా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.