మేళ్ళ చెరువులో వైభ‌వంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం

సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులోని మై హోమ్స్ సంస్థ మ‌హా సిమెంట్స్ ఆవ‌ర‌ణ‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అతిథులు, అనేక మంది ఆహ్వానితులు, భ‌క్తుల మ‌ధ్య చిన్న జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో క‌న్నుల పండుగ‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఆయ‌న స‌తీమ‌ణి ఉషా ద‌యాక‌ర్ రావులు హాజ‌ర‌య్యారు. మై హోమ్స్ జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు-సుకుమార్ దంప‌తులు స్వామివార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య స్వామి వారి క‌ళ్యాణం జ‌రిగింది. క‌ళ్యాణం అనంత‌రం చిన్న జీయ‌ర్ స్వామి మంత్రి ఎర్ర‌బెల్లి దంప‌తులు, రామేశ్వ‌ర‌రావు దంప‌తులు స‌హా, భ‌క్తులంద‌రికీ ఆశీర్వచనాలు అందించారు.
ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే చంద‌ర్ రావు, మై హోం ఇండ‌స్ట్రీస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, చుట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అనేక మంది పాల్గొన్నారు.