టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ -2020 నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్‌ దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 7వ తేదీ వరకు, ఈసెట్‌ దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 5వ తేదీ వరకు పొడిగించారు. ఎంసెట్‌ దరఖాస్తు గడువు ఈ నెల 30తో, ఈసెట్‌ దరఖాస్తు గడువు 28వ తేదీతో ముగియనుంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. విద్యార్థుల సౌకర్యార్థం ఏప్రిల్‌ 7 వరకు ఎంసెట్‌ దరఖాస్తు గడువును, ఏప్రిల్‌ 5 వరకు ఈసెట్‌ దరఖాస్తు గడువును పొడిగించారు.