
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర(తెలుగు నూతన సంవత్సరాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఉగాది పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలూ, సుఖ సంతోషాలు, ఐష్టెశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం తెలిపారు.