జిల్లాల వారిగా ధర నియంత్రణకు కమిటీలు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌

జిల్లాల వారిగా నిత్యవసర సరుకుల ధరలు నియంత్రించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎవరైనా సరుకుల ధరలు పెంచితే జైలుకు పంపుతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ హెచ్చరించింది. కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా సివిల్‌ సైప్లె ఆఫీసర్‌, జిల్లా మార్కెటింగ్‌ ఆఫీసర్‌, జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి, జిల్లా లీగల్‌ మెట్రోలాజీ అధికారులు సభ్యులుగా, జిల్లా వ్యవసాయ అధికారి కన్వీనర్‌గా ఈ కమిటీ పనిచేస్తుంది.