ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్యుడు సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ పై  సస్పెన్షన్ వేటు పడింది. సరైన రక్షణ చర్యలు లేకుండా అత్యవసర వైద్యం చేయమంటున్నారని సుధాకర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియా లో హల్ చల్ చేశాయి. దీంతో సుధాకర్ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.