
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 18.52 లక్షలకు చేరుకున్నాయి. మొత్తం ఇప్పటి వరకు ఒక లక్ష 14వేల మంది కరోనా వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. వైరస్ బారి నుంచి కోలుకుని నాలుగు లక్షల 23 వేల మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. అమెరికాలో 5.6 లక్షలకుపైగా కోరోనా కేసులు నమోదు కాగా 22,105 మంది మృత్యువాతపడ్డారు. స్పెయిన్లో ఒక లక్ష 66వేల మందికి కరోనా పాజిటివ్ రాగా 17వేల రెండు వందల తొమ్మిది మంది మరణించారు. ఇటలీలో ఒక లక్ష 56వేల కేసుల నమోదు కాగా 20వేల మందిని కరోనా మింగేసింది. ప్రాన్స్లో 1.32 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 14,393 మంది మరణించారు.