
తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు డీఐజీ(డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్)లుగా పదోన్నతి లభించింది. డీఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో కార్తికేయ, రమేశ్ నాయుడు, సత్యనారాయణ, సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు ఉన్నారు.
- సీఐడీ డీఐజీగా సుమతికి పదోన్నతి
- సీఐడీ డీఐజీగా శ్రీనివాసులకు పదోన్నతి
- సైబరాబాద్ సంయుక్త సీపీగా వెంకటేశ్వరరావు
- మాదాపూర్ డీసీపీగా వెంకటేశ్వరరావుకు అదనపు బాధ్యతలు
- డీఐజీ స్థాయిలో నిజామాబాద్ పోలీసు కమిషనర్గా కార్తికేయ
- డీఐజీ స్థాయిలో పోలీసు అకాడమీ ఉపసంచాలకులుగా రమేశ్ నాయుడు
- డీఐజీ స్థాయిలో రామగుండం పోలీసు కమిషనర్గా సత్యనారాయణ