
తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 66 నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది. ప్రస్తుతం 562 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 186 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు.