గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ ప్రారంభించిన గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ..

మొక్కల పంపిణీ ప్రారంభించిన గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ చేసే కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ప్రారంభించారు. గవర్నర్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి మొక్కను స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి..మంచి కార్యక్రమం చేస్తున్నారని సంస్థ ప్రతినిధులను గవర్నర్ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ మాట్లాడుతూ..బుక్ ఫేర్ కొచ్చే ప్రజలందరికీ ఈ గ్రీన్ చాలెంజ్ ఉద్దేశాన్ని తెలుపుతూ..మీరు పుస్తకాలతో పాటు మొక్కలు కూడా తీసుకొని వెళ్లి మీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫేర్ నిర్వాహకులు జూలూరి గౌరీశంకర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.