ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల

ఉపాధి హమీ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.307.50కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీల వేతనం రూ.237కు పెంచింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కూలీల వేతనం రూ.211 నుంచి రూ.237కు పెరిగింది. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ వేతనం అమల్లోకి వస్తుందని సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు వేతనాల పెంపుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.