విశాఖ ఎల్జీ కంపెనీ నుంచి మరోసారి గ్యాస్ లీక్ అయింది. ప్రస్తుతానికి గ్యాస్ లీక్ ఆగిపోయిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించిన కాసేపటికే గ్యాస్ మరోసారి లీక్ కావడంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. దీంతో పరిసరాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని అధికారులకు సూచించారు. ఇక ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నారు. కాగా ఇప్పటికే ఏపీ సీఎం జగన్ విశాఖకు చేరుకొని బాధితులను పరామర్శిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే స్టెరీన్ విష వాయువుతో.. పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మూడు వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేలాది జంతువులు కూడా మృత్యువాతపడ్డాయి.
