కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలుపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సీఎంకు వివరించారు.
అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ దుకాణాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నందున ఆ మేరకు షాపులు తెరిచేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు రేపటి నుంచి రాష్ట్రానికి రావడం ప్రారంభమవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. కరోనా నివారణ చర్యలపై జగన్ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.