హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ను చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి సందర్శించి నిర్వాహణ పట్ల అటవీశాఖ శ్రద్ధను ప్రశంసించారు. ఉదయమే సతీసమేతంగా శ్రీమతి అనురాధ జోషితో విచ్చేసిన చీఫ్ సెక్రటరీకి శ్రీమతి ఆర్ శోభ ప్రిన్సిపల్ చీఫ్ కాంసెర్వేటర్ అఫ్ ఫారెస్ట్ అండ్ HOFF తెలంగాణ చంద్ర శేఖర్ రెడ్డి, అడిషనల్ ప్రిన్సిపాల్ చీఫ్ కాంసెర్వేటర్ అఫ్ ఫారెస్ట్ మరియు పి. వెంకటేశ్వరులు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, హైదరాబాద్ స్వాగతం పలికి పార్క్ లోని వివిధ సదుపాయాలను చీఫ్ సెక్రటరీకి చూపిస్తూ పార్కు నిర్వహణను వివరించారు. పార్క్ విజిటర్ జోన్ లో ఉన్న EEC సెంటర్, ఓపెన్ క్లాస్ జిం, యోగ షెడ్, నేచర్ క్యాంపు వివరాలను చీఫ్ సెక్రటరీ నగరములో ఇలాంటివి ఉపయోగంగా ఉన్నాయి, ఈ పార్కు చూడాలన్న తన చిరకాల వాంఛ నేటి క్రిస్మస్ ఉదయాన చాల అద్భుతంగా వీరందరినీ కొనియాడారు. పార్కు నిర్వహణలో ప్రదర్శిస్తున్న శ్రద్ధను అటవీ శాఖను అభినందించారు. కన్సర్వేషన్ జోన్ లోని వాచ్ టవర్ ఫై నుంచి పార్కు పచ్చదనాన్ని చూసి పర్యావరణానికి చేస్తున్న సేవలు అద్భుతమైనవి అని చీఫ్ సెక్రటరీ గారు కొనియాడారు. అనంతరం వాచ్ టవర్ సమీపాన ప్లాంటింగ్ రాతి బండ మధ్య జువ్వి మొక్కను నాటి ఆ మొక్క బండ ఫై కూడా చక్కగా పెరుగుతుందని అన్నారు. చీఫ్ సెక్రటరీ గారితో పాటు మురళీధర్ సివిల్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పాల్గొని పార్కుకు తాను గత కొన్ని దశభాలుగా వస్తున్నానని ఆనాడు ఈ ప్రాంతం ఒక బంజరు నేల అని నేడు అద్భుతమైన పచ్చదనంతో కళకళలాడుతుంది అని అందుకు అటవీ శాఖ కృషిని అభినందించారు. చీఫ్ సెక్రటరీ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ని పరిశీలనాత్మకంగా చూసి తెలంగాణ లో Eco డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అర్బన్ పార్కులను Eco పార్కులను అభివృద్ధి చేయుటకు వాటి నిర్వాహణకు స్వయంసమృద్ధి ఆర్ధిక వనరులను పుష్కలమైన అవకాశముందన్నారు.