బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్ ప్రారంభం

హైదరాబాద్‌ నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద నిర్మించిన ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు గల మూడు లేన్ల ఫైఓవర్‌ నిర్మాణానికి రూ. 30.26 కోట్లు వ్యయం అయినట్లుగా సమాచారం. ఈ ఫ్లైఓవర్‌ పూర్తితో ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4 కింద రూ. 379 కోట్ల అంచనా వ్యయంతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు 12 కిలోమీటర్ల కారిడార్‌లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి.