ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 60 లక్షల 29 వేల 646 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 30 లక్షల 3 వేల 738. కోవిడ్-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 66 వేల 792 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని 26 లక్షల 59 వేల 116 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రభావానికి గురైతుంది. కోవిడ్-19తో యూఎస్ఏ నిన్న ఒక్కరోజే 1,225 మరణాలు సంభవించాయి. వ్యాధి కారణంగా యూఎస్ లో ఇప్పటి వరకు మొత్తం 1,04,542 మంది చనిపోయారు. 17 లక్షల 93 వేల 530 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు.
కోవిడ్-19 కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన వివిధ దేశాల వివరాలిలా ఉన్నాయి. బ్రెజిల్-27,944, రష్యా-4,374, స్పెయిన్-27,121, యూకే-38,161, ఇటలీ-33,229, ఫ్రాన్స్-28,714, జర్మనీ-8,594, టర్కీ-4,489, ఇరాన్-7,677, పెరూ-4,230, కెనడా-6,979, చైనా-4,634, మెక్సికో-9,415, పాకిస్థాన్-1,317, బెల్జియం-9,430, నెదర్లాండ్స్-5,931, ఈక్వెడార్-3,334, స్వీడన్-4,350, పోర్చుగల్-1,383, స్విర్జర్లాండ్-1,919, ఐర్లాండ్-1,645, ఇండోనేషియా-1,520, పోలాండ్-1,051, రోమేనియాలో 1,248 మంది చనిపోయారు.