ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా మలంగిర్‌కు చెందిన ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ తెలిపారు. వీరిలో మడకం దేవాపై రూ.లక్ష రివార్డు ఉన్నదని, లొంగిపోయిన ప్రతిఒక్కరికీ రూ.10 వేలు ప్రోత్సాహకాలను అందజేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు.