తెలంగాణ రాష్ట్రం లో మంగళవారం 945 కరోనా పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన కేసులే 869 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి -21, మేడ్చల్-13, నిర్మల్లో 4 కేసు లు రాగా, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో రెండుచొప్పున, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున న మోదయ్యాయి. వైరస్తో ఏడుగురు ప్రా ణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 88,563 మందికి పరీక్షలు చేయగా.. 16,339 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మొత్తం 260 మంది మరణించారు. చికిత్స అనంతరం మంగళవారం 1,712 మందితో కలిపి మొత్తం 7,294 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది.
