హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ముస్తఫానగర్ అగ్రహారం రోడ్డులో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు.
ఆయన వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, అటవీశాఖ అధికారి ప్రవీణ, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు ఉన్నారు.