తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా మరో 1,550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 926 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. రంగారెడ్డిలో 212, కరీంనగర్లో 86, మేడ్చల్ మల్కాజిగిరిలో 53, నల్లగొండలో 41, ఖమ్మం 38, కామారెడ్డి 33, సంగారెడ్డి 19, వరంగల్ అర్బన్లో 16, మహబూబాబాద్, మహబూబ్నగర్లో 13, సూర్యాపేట, సిద్దిపేట, జనగామ, భద్రాద్రి కొత్తగూడెంలో 10 , వరంగల్ రూరల్, ని జామాబాద్లో 8, రా జన్న సిరిసిల్ల జిల్లా లో 7, పెద్దపల్లి, మెదక్, జయశంకర్ భూపాలపల్లిలో 6, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరిలో 5, వికారాబాద్ 3, నాగర్కర్నూల్ 2, వనపర్తి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఒకకేసు చొప్పున న మోదయ్యాయి. 9మంది మృతిచెందగా.. మొత్తం మృతులు 365కు పెరిగారు.
