తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,473 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,532కు చేరగా, ఇప్పటి వరకు కరోనాతో 471 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 42,106 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 12,955 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.85 శాతం కాగా, దేశ వ్యాప్తంగా ఆ రేటు 2.3 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 9,817మంది నమూనాలను పరీక్షించగా, 1,473 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ర్టంలో ఇప్పటి వరకు 3,63,242 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతి 10 లక్షల జనాభాలో 245 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 506, రంగారెడ్డిలో 168, వరంగల్ అర్బన్లో 111, సంగారెడ్డిలో 98, కరీంనగర్లో 91, మేడ్చల్ మల్కాజ్గిరిలో 86, మహబూబాబాద్లో 34, జోగులాంగ గద్వాలలో 32, సూర్యాపేటలో 32, నల్లగొండలో 28, ఆదిలాబాద్ జిల్లాలో 28, ఖమ్మంలో 20, జగిత్యాలలో 18, జనగామలో 10, భద్రాద్రి కొత్తగూడెంలో 10, భూపాలపల్లిలో 10, కామారెడ్డిలో 17, మహబూబ్నగర్లో 8, మంచిర్యాలలో 14, మెదక్లో 17, ములుగులో 12, నాగర్కర్నూల్లో 19, నారాయణపేటలో 2, నిజామాబాద్లో 41, రాజన్న సిరిసిల్లలో 19, సిద్దిపేటలో 12, వికారాబాద్లో 2, వనపర్తిలో 9, వరంగల్ రూరల్లో 8, యాదాద్రి జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.