ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా.. జిల్లాలోని సారంగాపూర్ మండలం గండి రామన్న హరితవనం పార్కులో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. అలాగే నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. అనంతరం నూతనంగా ప్రారంభo కానున్న నాగభైరవ సీరియల్ షూటింగ్ ను మంత్రి క్లాప్ కొట్టి ప్రారంభిoచారు.
