హైకోర్టులో ఏపీ సర్కారుకు మరో షాక్

ఏపీ సర్కారుకు హైకోర్టులో మరో సారి చుక్కెదురైంది. తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ ముగిసింది. గతంలో చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు  ప్రభుత్వం 483 ఎకరాలు కేటాయించింది. ఇటీవల ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చే సింది. దీనిని సవాల్‌ చేస్తూ అమర‌రాజా సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం విచారణ జరిపింది. కోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.