గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 464 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 77,513కి చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 14 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 615కి చేరింది. ప్రస్తుతం 22,568 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 1,091 మంది బాధితులు డిశ్చార్జి కాగా, 54,330 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 23,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,90,306 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 1,596 శాపిళ్ల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పింది. మరో 15,830 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో రికవరీ రేటు 70.09శాతంగా ఉందని, ఇది దేశ సగటు (67.98శాతం) కంటే ఎక్కువ అని వివరించింది.
