చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు.
