శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. రెస్క్యూ టీం అయిదుగురు మృత దేహాలను బయటకు తీసుకొచ్చారు.. మిగిలిన నాలుగు మృతదేహాలను తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో 19 మంది సిబ్బంది ఉండగా వారిలో 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. మృతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. డీఈ శ్రీనివాస్ గౌడ్(హైదరాబాద్)
2. ఏఈ వెంకట్రావు(పాల్వంచ)
3. ఏఈ మోహన్ కుమార్(హైదరాబాద్)
4. ఏఈ ఉజ్మ ఫాతిమా(హైదరాబాద్)
5. ఏఈ సుందర్(సూర్యాపేట)
6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు(ఖమ్మం)
7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్(పాల్వంచ)
8. అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్(హైదరాబాద్)
9. అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది మహేష్ కుమార్(హైదరాబాద్)