ప్రజలకు గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అతి త్వరలో కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించి రాష్ట్ర, దేశ ప్రజలందరు సాధారణ జీవన పరిస్థితులకు వచ్చేలా చూడాలని వినాయకుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.