తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 295 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,08,670 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 9 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 770కి చేరింది. ఇవాళ 1,752 మంది వైరస్ బారినుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 84,163 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 23,737 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్కేంద్రాల్లో 17,226 మంది ఉన్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో 52,933 మందికి కొవిడ్ -19 పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 10, 21,054 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో 295, రంగారెడ్డి జిల్లాలో 186, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 83, ఖమ్మంలో 161, వరంగల్ అర్బన్ జిల్లాలో 143, వరంగల్ గ్రామీణ జిల్లాలో 31, ఆదిలాబాద్ జిల్లాలో 34, జగిత్యాల జిల్లాలో 98, జనగామా జిల్లాలో 46, జోగుళాంబా గద్వాల జిల్లాలో 47, నల్గొండ జిల్లాలో 129, కామారెడ్డి జిల్లాలో 64, సిద్దిపేట జిల్లాలో 92, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 59, పెద్దపల్లి జిల్లాలో 85, సూర్యాపేట జిల్లాలో 78, నిజమాబాద్ జిల్లాలో 142, మహబూబాబాద్ జిల్లాలో 81, మహబూబ్నగర్ జిల్లాలో 69, నారాయణపేట జిల్లాలో 19, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10, మెదక్ జిల్లాలో 42, ములుగు జిల్లాలో 16, నిర్మల్ జిల్లాలో 28, సంగారెడ్డి జిల్లాలో 30, వికారాబాద్ జిల్లాలో 23, వనపర్తి జిల్లాలో 56, యాదాద్రి భువనగిరి జిల్లాలో 46, నాగర్కర్నూల్ జిల్లాలో 48, మంచిర్యాల జిల్లాలో 104, కరీంనగర్ జిల్లాలో 116, కామారెడ్డి జిల్లాలో 64, భూపాలపల్లి జిల్లాలో 12, జగిత్యాల జిల్లాలో 98, ఆదిలాబాద్ జిల్లాలో 34 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.