టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు కరోనా పాజిటివ్‌

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వైద్యాధికారుల సూచనల మేరకు చికిత్స పొందుతున్నానని, ఈ 14 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. తనకు దైవ సమానుడైన చంద్రబాబునాయుడు, అభిమానుల ఆశీస్సుల మేరకు కరోనాను జయించి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానని బుద్ధ వెంకన్న ట్వీట్‌ చేశారు.