ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయం సృష్టిస్తున్నది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా నిర్ధారణ అయ్యాయి. తాజాగా 10,368 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,139కు చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 84 మంది మృతి చెందగా.. మొత్తం 4,053 మంది మృతి చెందారు. గడిచిన 24గంటల్లో 9,350 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,210 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,39,876 మంది కోలుకున్నారు. కొత్తగా 59,834 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 37,82,746 టెస్టులు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.