గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కమెడియన్ సత్య రాజేష్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కుమారుడు తో కలిసి మొక్కలు నాటిన కమెడియన్ సత్య రాజేష్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని కమెడియన్ సత్య రాజేష్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూ కమెడియన్ చిత్రం శ్రీను విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటిన కమెడియన్ సత్య రాజేష్.. అనంతరం మరో ముగ్గురు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, విలన్ లు రవిరాజా, శత్రువు లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.