నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు సంబంధించిన భూమికి ఎన్వోసీ ఇవ్వడానికి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతులు మూర్తితో పాటు పలువురు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం రూ.1.12 కోట్లకు సంబంధించి చెక్ తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నగేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఉదయం నుంచి మెదక్ పట్టణంలో నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నారు.
ఎకరానికి లక్ష చొప్పున నగేష్ డిమాండ్ చేశారని, రైతు ఫిర్యాదుతో వల పన్ని పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు. 12 చోట్ల నగేష్ ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయని వివరించారు. నగేష్ భార్యను బోయిన్ పల్లిలోని బ్యాంక్ కు అదికారులు తీసుకువెళ్తున్నారు. అక్కడ లాకర్లు తెరిపించే అవకాశం ఉన్నది. కోటి లంచంతో ఉన్నతాధికారి దొరికి పోవడం సంచలనంగా మారింది.